హిందువులు ఎంతో పరమ పవిత్రంగా భావించే మాసాల్లో కార్తీక మాసం ఒకటి. శివ, కేశవులకు ఇద్దరికి ఈ మాసం ఎంతో ప్రీతికరం. కార్తీకమాసం నేపథ్యంలో భక్తులు ప్రతి రోజు దీపారాధన చేస్తారు. అలానే ఈ మాసంలో శివుడు, విష్ణువు ఆలయాలకు భక్తులు పోటెత్తుతారు. కార్తీక పౌర్ణమి రోజు ప్రతి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. చాలా మంది కార్తీక మాసంలో శ్రీశైలం వెళ్లి మల్లన్న దర్శనం చేసుకోవాలని భావిస్తారు. ఈసారి కార్తీక మాసంలో శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉందని అంటున్నారు. ఈ క్రమంలో మల్లన్న భక్తులకు ఆలయ అధికారులు శుభవార్త చెప్పారు. వాటిని పూర్తి ఉచితంగా అందిస్తామని తెలిపారు. ఆ వివరాలు..
కార్తీక మాసం కావడంతో శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. కార్తీక మాసం పవిత్రతను దృష్టిలో పెట్టుకుని పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీశైలం మల్లన్న దర్శనానికి తరలి వస్తున్నారు.పెరిగిన భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మల్లన్న దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మల్లన్న దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసిన అధికారులు.. వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేశారు.
కార్తీక మాసం నేపథ్యంలో.. వచ్చే నెల అనగా నవంబర్ 14న శ్రీశైలంలో కోటి దీపోత్సవం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే మల్లన్న దర్శనం కోసం శ్రీశైలం వచ్చే భక్తులకు ఆలయ పాలక మండలి శుభవార్త చెప్పింది. భక్తులకు ఉచితంగా లడ్డు అందిస్తామని తెలిపారు. స్వామి వారి స్పర్శ దర్శన టికెట్ తీసుకున్న భక్తులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ టికెట్ తీసుకున్న ప్రతి భక్తుడికి ఉచితంగా లడ్డు అందిస్తామని ఆలయ ఛైర్మన్ రమేశ్ నాయుడు తెలిపారు.
కార్తీక మాసం నేపథ్యంలో.. శ్రీశైలం మల్లన్న ఆలయంలో కార్తీక మాసోత్సవాలు మొదలయ్యాయి. నవంబర్ నెల 21 వరకు కార్తీక మహోత్సవాలు కొనసాగుతాయని దేవస్థానం ఈవో ఎం శ్రీనివాసరావు తెలిపారు. అలానే కార్తీక మాసం రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీనిలో భాగంగా రూ.5 వేల గర్భాలయ అభిషేకం, రూ.1500 సామూహిక అభిషేకం టికెట్లను రద్దు చేశారు. అలాగే భక్తులకు రోజూ విడతల వారీగా శివయ్య స్పర్శ దర్శనం కల్పించనున్నారు. ఇప్పుడు స్పర్శ దర్శంన టికెట్ కొన్న భక్తులకు లడ్డు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa