ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తుఫాన్ నేపథ్యంలో అన్ని పోర్టుల్లో ఒకటో నెంబర్ హెచ్చరిక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 27, 2025, 03:37 PM

నైరుతి - ఆగ్నేయ బంగాళాఖాతాలను ఆనుకుని మొంథా తుఫాన్ వేగంగా కదులుతోంది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో ఏపీలో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది. ఆరు రాయలసీమ, మూడు కోస్తా జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని పేర్కొంది. అలాగే ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, అనంతపురం, కర్నూల్, నంద్యాల, వైఎస్సార్ కడప ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉన్నట్లు వెల్లడించారు. తీరం వెంబడి బలమైన గాలులు ఉంటాయని.. మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని స్పష్టం చేసింది. అన్ని పోర్టుల్లో ఒకటో నెంబర్ హెచ్చరిక కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.


రెడ్ అలర్ట్ జిల్లాలు:విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా


ఆరెంజ్ అలర్ట్ జిల్లాలు:శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు


ఎల్లో అలర్ట్ జిల్లాలు:కర్నూలు, అనంతపురం, సత్యసాయి






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa