ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంద్రకీలాద్రిపై రాజకీయాలను ముడిపెట్టవద్దు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 27, 2025, 03:37 PM

విజయవాడ కనకదుర్గా మల్లేశ్వరస్వామి ఆలయ పరిధిలో ఎలాంటి రాజకీయ విమర్శలు చేయొద్దని పాలకమండలి సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాజకీయ పక్షాలు అందరికీ ఇదే కీలక విజ్ఞప్తి చేశారు. ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణం పవిత్రమైనదని.. దయచేసి అమ్మవారి ప్రాంగణంలో రాజకీయ ఉపన్యాసాలు, రాజకీయ ఆరోపణలు చేయటం మానుకోవాలని సూచించారు పాలకమండలి సభ్యులు.దుర్గగుడి ప్రాంగణం, ఘాట్ రోడ్డు, కామదేను అమ్మవారి ఆలయం, కనకదుర్గానగర్‌ సమీప ప్రాంతాల్లో ఎలాంటి రాజకీయ అంశాలకు తావులేదని స్పష్టం చేశారు పాలకమండలి సభ్యులు. దేవాలయ సమీపంలో ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయకూడదని చెప్పుకొచ్చారు. ఆలయాలకు రాజకీయాలను ముడిపెట్టే ప్రయత్నం ఏమాత్రం చేయొద్దని విన్నవించారు. ఈ నేపథ్యంలో ఇంద్రకీలాద్రి దేవస్థానం పాలకమండలి ఓ ప్రకటన విడుదల చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa