ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్టీసీ బస్సు - లారీ ఢీకొని ఓ మహిళ మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 28, 2025, 02:58 PM

నంద్యాల జిల్లా అవుకు మండలం అవుకు జలాశయం సమీపంలో మంగళవారం ఉదయం ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘోర ప్రమాదంలో శివవరం గ్రామానికి చెందిన చాకలి లక్ష్మీదేవి (40) అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంలో మరో ఆరుగురికి గాయాలయ్యాయి. తాడిపత్రి నుంచి వస్తున్న లారీ, బనగానపల్లె నుంచి ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు జలాశయం మలుపు వద్ద వేగంగా వచ్చి ఢీకొన్నట్లు తెలుస్తోంది. స్థానికులు సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, రెవెన్యూ, ఆర్టీసీ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa