ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయనున్న జపాన్

international |  Suryaa Desk  | Published : Tue, Oct 28, 2025, 03:54 PM

ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను నామినేట్ చేసే దేశాల జాబితాలో జపాన్ కూడా చేరనుంది. ప్రస్తుతం ఆసియా పర్యటనలో ఉన్న ట్రంప్‌కు మద్దతు తెలుపుతున్నట్లు జపాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు వైట్‌హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది.సోమవారం జపాన్ పర్యటనకు వచ్చిన డొనాల్డ్ ట్రంప్, ఆ దేశ నూతన ప్రధాని సనే టకైచీతో సమావేశమయ్యారు. టోక్యోలోని అకసకా ప్యాలెస్‌లో జరిగిన ఈ భేటీ సందర్భంగా, నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ నామినేషన్‌కు తాము మద్దతిస్తామని టకైచీ స్పష్టం చేసినట్లు వైట్‌హౌస్ పేర్కొంది. అయితే, దీనిపై జపాన్ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ట్రంప్ తనను తాను 'శాంతి అధ్యక్షుడు'గా అభివర్ణించుకుంటున్నారు. గాజా యుద్ధం, భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతలు, థాయ్‌లాండ్-కంబోడియా వివాదం సహా మొత్తం ఎనిమిది యుద్ధాలకు ముగింపు పలికినట్లు ఆయన పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ఆయనకు దక్కనప్పటికీ, ఇజ్రాయెల్, పాకిస్థాన్, కంబోడియా, థాయ్‌లాండ్ వంటి అనేక దేశాలు ఇప్పటికే ఆయన అభ్యర్థిత్వానికి బహిరంగంగా మద్దతు తెలిపి, అధికారికంగా నామినేట్ చేశాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa