మోంథా తుపాను నేపథ్యంలో వైయస్ఆర్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులతో గురువారం ఉదయం11 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మాజీ సీఎం, వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. తుపాను తర్వాత జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులు, పంట నష్టం వంటి వివరాలను పార్టీ కేడర్ను ఆయన అడిగి తెలుసుకోనున్నారు. బాధితులకు ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా ఒత్తిడి తీసుకురావడంపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అండగా నిలవాలన్న వైయస్ జగన్ పిలుపు మేరకు పార్టీ నాయకులు, శ్రేణులు క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేశారు. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకూ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ కార్యకర్తలు తుపాను బాధితులకు బాసటగా నిలిచారు. ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించడంలో, వారికి ఆహారం అందించడంలో సేవలందించారు. తుపానువల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన బాధితులకు భరోసా ఇవ్వడంతో పాటు వివరాలను సేకరించారు. వాటిని వీడియో కాన్ఫరెన్స్లో వైయస్ జగన్కు వివరించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa