ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తుఫాన్ నేపథ్యంలో పంట నష్టపోయిన రైతులకి ఎకరాకు రూ. 50 వేల రూపాయలు చెల్లించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 30, 2025, 12:44 PM

మోంథా తుపాను వల్ల గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీట మునిగి పంట నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని, నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ. 50 వేల రూపాయలు ప్రభుత్వం నేరుగా చెల్లించాలని వైయ‌స్ఆర్‌సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జ్ పేరాడ తిలక్ డిమాండ్ చేశారు. వర్షం వల్ల నందిగాం మండలం చిన్న తామరపల్లి, కర్లపూడి గ్రామాల్లో నీట మునిగిన పంట పొలాలను రైతులతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా తిలక్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఏడాది కనీసం రైతులకు ఎరువులు కూడా పంపిణీ చేయకపోవడం వల్ల దళారుల దగ్గర అధిక రేటుకు ఎరువులు కొనుగోలు చేసి పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టడం జరిగిందని, అయితే ఈ వర్షాల వల్ల  వరి పంట నేలకొరిగి నీట మునిగి పోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. పంట పొలాలు నీట మునిగి రెండు రోజులు గడుస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు గాని రెవెన్యూ అధికారులు కానీ పంట పొలాలను పరిశీలించి నష్టాన్ని అంచనా వేయడం లేదని అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చన్నాయుడు కనీసం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఇప్పటికైనా తక్షణం ప్రభుత్వ స్పందించి గ్రామాల్లో అధికారుల ద్వారా నష్టపోయిన రైతాంగాన్ని గుర్తించి పంట పోయిన ప్రతి ఎకరానికి రైతులకు నేరుగా 50వేల రూపాయల నష్టపరిహారాన్ని అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నందిగాం ఎంపీపీ నడుపూరు శ్రీరామమూర్తి, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కురమాన బాలకృష్ణారావు,  నాయకులు చిన్ని జోగారావు యాదవ్, సర్పంచులు పోలాకి మోహనరావు, జడ్యాడ జయరాం, తమిరి రాజు, తమిరి దేవేందరరావు, ఎంపీటీసీ సభ్యులు అంబోడి విష్ణు, సైలాడ లావన్న, టొంప రామారావు, మన్నెల రమణ కర్లపూడి పంచాయతీకి చెందిన నాయ‌కులు పాల్గొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa