ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీహార్ ఎన్నికలలో ఎన్డీయే మేనిఫెస్టోలో కీలక అంశాలివే

national |  Suryaa Desk  | Published : Fri, Oct 31, 2025, 03:59 PM

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు-2025 సమీపిస్తున్న వేళ, అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) తమ ఎన్నికల మేనిఫెస్టో 'సంకల్ప్ పత్ర'ను తాజాగా విడుదల చేసింది. భారీ ఎత్తున ఉద్యోగాల కల్పన, మహిళా సాధికారత, రైతులు, పేదలకు సంక్షేమ పథకాలను ప్రధాన హామీలుగా ప్రకటించింది.


పేదల కోసం 'పంచామృత్ గ్యారెంటీ': ఉచిత రేషన్, 125 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం, 50 లక్షల పక్కా ఇళ్ల నిర్మాణం, సామాజిక భద్రతా పింఛన్లు అందిస్తామని ఎన్డీయే హామీ.


 కనెక్టివిటీ: ఏడు కొత్త ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణం, 3,600 కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌ల ఆధునికీకరణ, నాలుగు కొత్త నగరాల్లో మెట్రో సేవలు.


పారిశ్రామిక పార్కులు: ప్రతి జిల్లాలో ఫ్యాక్టరీలు, 10 కొత్త ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు.


విద్య: పేద కుటుంబాల విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య.


రైతుల కోసం 'కర్పూరీ ఠాకూర్ కిసాన్ సమ్మాన్ నిధి' పథకాన్ని ప్రకటించింది. దీని కింద ప్రతి రైతుకు పంట సీజన్‌కు రూ.3,000 చొప్పున ఏటా రూ.9,000 అందిస్తామని హామీ ఇచ్చింది.


'ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన' కింద వ్యాపారాలు ప్రారంభించే మహిళలకు రూ.2 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తామని ఎన్డీయే ప్రకటించింది. కోటి మంది మహిళలను లక్షాధికారులుగా (లక్షాధికారి దీదీ)గా (ఏడాదికి లక్ష రూపాయలకు పైగా సంపాదించే మహిళలు) తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa