ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళల భారత జట్టు ఇరగదీసింది

sports |  Suryaa Desk  | Published : Fri, Oct 31, 2025, 03:58 PM

మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో ఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన హోరాహోరీ సెమీఫైనల్ మ్యాచ్‌లో ఏడుసార్లు ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాపై 5 వికెట్ల తేడాతో భారత్ చారిత్రక విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా 2005, 2017 తర్వాత మూడోసారి ప్రపంచకప్ ఫైనల్‌కు చేరింది.ఈ అద్భుత విజయంపై భారత స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందిస్తూ జట్టుపై ప్రశంసల వర్షం కురిపించాడు. “ఆస్ట్రేలియా లాంటి బలమైన ప్రత్యర్థిపై మన జట్టు సాధించిన విజయం అద్భుతం. అమ్మాయిలు గొప్పగా ఛేదించారు. ముఖ్యంగా జెమీమా కీలక మ్యాచ్‌లో అసాధారణ ప్రదర్శన చేసింది. ఇది పట్టుదల, విశ్వాసం, అభిరుచికి నిజమైన నిదర్శనం. వెల్ డన్ టీమిండియా!” అని ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్ట‌ర్‌)లో పోస్ట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa