శత్రువులకు భారత్ ఇచ్చే సమాధానం ఇప్పుడు చాలా స్పష్టంగా, బలంగా, ప్రపంచానికి కనిపించేలా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం గుజరాత్లోని 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ' వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 'ఆపరేషన్ సిందూర్' ద్వారా శత్రు భూభాగంలోకి ప్రవేశించి మరీ దాడులు చేయగలమని భారత్ నిరూపించిందని ఆయన స్పష్టం చేశారు."ఎవరైనా భారత్ వైపు కన్నెత్తి చూసే సాహసం చేస్తే, భారత్ వారి ఇంట్లోకి చొరబడి మరీ దెబ్బకొడుతుందని 'ఆపరేషన్ సిందూర్'తో ప్రపంచమంతా చూసింది. ఈ రోజు పాకిస్థాన్కు, ఉగ్రవాద నిర్వాహకులకు భారత్ అసలైన శక్తి ఏంటో బాగా తెలుసు" అని ప్రధాని అన్నారు. దేశ భద్రత విషయంలో తమ ప్రభుత్వ దృఢ వైఖరి, సర్దార్ పటేల్ ఆశయాలకు అనుగుణంగానే ఉందని ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa