ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాని మోదీ వ్యాఖ్యలని ఖండించిన సీఎం స్టాలిన్

national |  Suryaa Desk  | Published : Fri, Oct 31, 2025, 03:56 PM

తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం బీహార్ వలస కార్మికులను వేధిస్తోందంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాని తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారంటూ ఘాటుగా బదులిచ్చారు.బీహార్‌లో జరిగిన ఓ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో పనిచేస్తున్న బీహారీ కార్మికులను డీఎంకే ప్రభుత్వం అవమానిస్తోందని, వారిపై వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో, ప్రధాని వ్యాఖ్యలను ఖండిస్తూ సీఎం స్టాలిన్ 'ఎక్స్' వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు."ఒక తమిళుడిగా ప్రధాని మోదీని నేను వినయంగా కోరుతున్నాను. ఆయన దేశ ప్రజలందరికీ ప్రధాని అనే గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారనే విషయాన్ని తరచుగా మర్చిపోతున్నారేమో అని బాధగా ఉంది. ఇలాంటి ప్రకటనలతో తన పదవికి ఉన్న గౌరవాన్ని కోల్పోవద్దు" అని స్టాలిన్ పేర్కొన్నారు. బీజేపీ సభ్యులు కేవలం ఎన్నికల రాజకీయాల కోసం ఒడిశా, బీహార్ అంటూ తమిళులపై తమ ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నారని, ఒక ముఖ్యమంత్రిగా ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa