ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) విధానాన్ని అడ్డుకునేందుకు అన్ని వర్గాల ప్రజలను చైతన్యవంతం చేద్దామని వైయస్ఆర్సీపీ కోడుమూరు ఇన్చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సతీష్, ఎస్ఈసీ సభ్యుడు కోట్ల హర్షవర్ధన్ పిలుపునిచ్చారు. సి.బెళగల్ మండలం పోలకల్ గ్రామంలో శుక్రవారం సి బెలగల్ మండల కన్వీనర్ సోమశేఖర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పోలకల్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రచ్చబండ-కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కుడా మాజీ చైర్మన్ కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఎస్ఈసీ) సభ్యులు కోట్ల హర్షవర్ధన్రెడ్డి మాట్లాడుతూ..మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న సంతకాల సేకరణ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. కోటి సంతకాల సేకరణ కార్యక్ర మంలో స్వచ్ఛందంగా పాల్గొని ప్రభుత్వంపై తమ నిరసన తెలియజేస్తున్నారన్నారు. నవంబర్ 11న నిర్వహించే కోడుమూరు నియోజవర్గ కేంద్రంలో ప్రజా ఉద్యమంలో పార్టీలకు సంబంధం లేకుండా ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa