ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కల్తీ మద్యం తయారీలో టీడీపీ నేతలు దొరికి, వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 02, 2025, 02:34 PM

మాజీ మంత్రి జోగి ర‌మేష్ అరెస్టు పూర్తిగా అక్ర‌మ‌మ‌ని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత‌లు,  మాజీ మంత్రులు పేర్ని వెంకట్రామయ్య (నాని) మండిపడ్డారు. అయన మాట్లాడుతూ... ఇది కేవలం కక్ష సాధింపు చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కల్తీ మద్యం కేసులో జోగిరమేష్‌ను దురుద్దేశంతోనే ఇరికించారు. కస్టడీలో ఉన్న కేసులో ఏ–1 నిందితుడు జనార్థన్‌రావు ద్వారా జోగి రమేష్‌ పేరు చెప్పించారు. దానిపై జోగి రమేష్‌ చేసిన సవాల్, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ సాక్షిగా ఆయన చేసిప ప్రమాణంపై ఇప్పటి వరకు స్పందించని టీడీపీ నేతలు, జోగి రమేష్‌ కుటుంబాన్ని ఇంకా వైయ‌స్ఆర్‌సీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం చేసుకున్నారు. అందుకే రాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు, అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారు. కల్తీ మద్యం తయారుచేస్తూ టీడీపీ నాయకులు అడ్డంగా దొరికిపోవడంతో, ఆ బురదను వైయ‌స్ఆర్‌సీపీకి అంటించే కుట్ర చేస్తున్నారు. కల్తీ మద్యం కేసులో సీబీఐ దర్యాప్తు కోరిన జోగి రమేష్‌ దానిపై హైకోర్టులో పిటిషన్‌. అది విచారణకు రాకముందే జోగి రమేష్‌ను అక్రమంగా అరెస్టు చేశారు. కల్తీ మద్యం కేసులో పక్కా ఆధారాలున్నా, కొందరు టీడీపీ నాయకులు అరెస్ట్‌ లేదు. కేవలం కక్ష సాధింపు కోసమే జోగి రమేష్‌ను ఇరికించి అరెస్టు చేశారు.ప్రభుత్వ దమనకాండను ప్రజాక్షేత్రంలో ఎండగడతాం అని అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa