ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పసుపు నీరు అతిగా తాగితే.. ఈ అనారోగ్య సమస్యలు తప్పవ్!

Health beauty |  Suryaa Desk  | Published : Sun, Nov 02, 2025, 02:36 PM

పసుపులో ఉండే కర్కుమిన్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది. అయితే, పసుపు నీటిని అధిక మోతాదులో తాగడం వల్ల జీర్ణకోశ సమస్యలు, కడుపు నొప్పి, అసిడిటీ, విరేచనాలు, రక్తస్రావం ప్రమాదం, కిడ్నీలో రాళ్లు, ఐరన్ శోషణ తగ్గడం, కాలేయ సమస్యలు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ రోజుకు 1.5 గ్రాముల పసుపు పొడిని వాడటం సురక్షితం అని సూచిస్తుంది. ఆ లెక్క ప్రకారం వాడితే చాలని నిపుణులంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa