ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూటమి ఏర్పడ్డాక పలు దేవాలయాల్లో ఎంతో మంది చనిపోవడానికి కారణం ప్రభుత్వ వైఫల్యం కాదా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 02, 2025, 02:36 PM

కార్తీక మాసంలో ఏకాదశి రోజున కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాటకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. స్వామి వారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చినా, అక్కడ తగిన ఏర్పాట్లు చేయలేదని, మరోవైపు భద్రతా చర్యలపై ప్రభుత్వం ఏ మాత్రం దృష్టి పెట్టలేదని ఆయన చెప్పారు. పైగా ఆ ఆలయం దేవాదాయ శాఖ అధీనంలో లేదని చెప్పడం హేయమని, ఆలయం ఎవరిదైనా ప్రజలు, భక్తుల భద్రత బాధ్యత కచ్చితంగా ప్రభుత్వానిదే అని పలాసలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తేల్చి చెప్పారు.  సింహాచలంలో పవిత్ర చందనోత్సవం రోజున గోడ కూలి ఏడుగురు భక్తులు దుర్మరణం చెందారు. అంతకు ముందు వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారి దర్శనం టోకెన్ల జారీ కేంద్రం వద్ద తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. అక్కడా ప్రభుత్వ నిర్లక్ష్యమే స్పష్టంగా కనిపించింది. రాష్ట్రంలో ఇలా వరస ఘటనలు జరుగుతున్నా, వాటిపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. అలాంటి వాటి నివారణకు తగిన చర్యలు తీసుకోవడం లేదు. ప్రజలు, భక్తుల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఇకనైనా ప్రభుత్వం బుద్ది తెచ్చుకుని ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుని ప్రజలు, భక్తుల ప్రాణాలు కాపాడాలి. కాశీబుగ్గ దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి. అలాగే క్షతగాత్రులకు కూడా తగిన పరిహారం ప్రకటించి ఆదుకోవాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు డిమాండ్‌ చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa