ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసే వారికి గుడ్ న్యూస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 02, 2025, 08:41 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలోనే అర్హులైన వారందరికి పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించింది. ఈమేరకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. త్వరలోనే అర్హులైన వారందరికీ కొత్త పింఛన్లు ఇస్తామని ఆయన తెలిపారు. శనివారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.


నవంబర్ నెలకు సంబంధించి ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కోసం నందిగాంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద అర్హులైన లబ్ధిదారులందరికీ త్వరలోనే కొత్త పింఛన్లు అందిస్తామని అచ్చెన్నాయుడు ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని తెలిపారు. పింఛన్ల పెంపుతో ఎంతోమంది పేదలకు మేలు జరుగుతోందని మంత్రి అచ్చెన్న అభిప్రాయపడ్డారు.


పింఛన్‌దారుడైన వ్యక్తి మరణిస్తే.. వెంటనే తర్వాత నెల నుంచే అతడి భార్యకు వితంతు పింఛన్ అందజేస్తున్నానమని అచ్చెన్నాయుడు తెలిపారు. గత వైసీపీ పాలనలో అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని.. సీఎం చంద్రబాబునాయుడు, ప్రధాని మోదీ సహకారంతో అభివృద్ధి చేస్తున్నారని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు సిగ్గుచేటంటూ మంత్రి అచ్చెన్న మండి పడ్డారు.


టెక్కలి నియోజకవర్గంలో తాగునీటి సరఫరా కోసం కూటమి ప్రభుత్వం రూ.700 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ పనులకు సంబంధించి.. త్వరలో టెండర్లు పిలిచి వాటిని మొదలు పెడతామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అలానే వీలైనంత త్వరగా రోడ్ల నిర్మాణాలు కూడా పూర్తిచేసి.. నియోజకవర్గ అభివృద్ధికి మార్గం సుగమం చేస్తామని అచ్చెన్న హామీ ఇచ్చారు.


రాష్ట్రంలో పంటల బీమా పథకానికి సంబంధించి.. దీన్ని పాత పద్ధతిలోనే అమలు చేస్తున్నామన్నారు. తాజాగా రాష్ట్రాన్ని భయపెట్టిన మొంథా తుఫాన్‌తో నష్టపోయిన రైతులకు పరిహారం అందజేస్తామని తెలిపారు. అధికారులు సిద్ధం చేసిన నివేదికలను వెంటనే కేంద్రానికి పంపి, రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు.


ఆంధ్రప్రదేశ్‌లో శనివారం అనగా నవంబర్ 1 నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. శనివార ఉదయం 6.30 గంటల నుంచి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. అయితే నేడు అనగా నవంబర్ 2, ఆదివారం కావడంతో.. ఇవాళ పెన్షన్ పంపిణీ ఉందడు. తిరిగి సోమవారం అనగా నవంబ్ 3న మిగిలిన పెన్షన్లు పంపిణీ చేశారు. సోమవారంతో పింఛన్‌లు పంపిణీ చేయడం ముగుస్తుంది. అయితే ఈ నెలలో కూడా అప్పీల్ చేయని పింఛన్‌దారులకు కూడా డబ్బులు విడుదల చేశారు. అలానే స్పౌజ్ కేటగిరీలో కూడా కొందరికి కొత్తగా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa