ఆంధ్రప్రదేశ్లో రైతుల రబీలో సాగుకు సిద్ధమయ్యారు.. వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులకు సంబంధించి ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. రైతులకు విత్తనాలు, ఎరువుల సమస్య తలెత్తకుండా రైతుసేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతున్నారు. వరి, మినుము, శనగలు, ఇతర విత్తనాలు అందించేందుకు సిద్ధమయ్యారు. ఆయా జిల్లాల్లో సాగుచేసే పంటల్ని బట్టి విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నారు. ప్రధానంగా రైతులు ఎరువుల వినియోగం తగ్గించి పచ్చిరొట్ట విత్తనాలపై ఫోకస్ పెట్టాలని అధికారులు సూచిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం జీలుగ, జనుము విత్తనాలు అందుబాటులో ఉంచింది. ఒక్కో రైతుకు ఐదు ఎకరాల వరకు 50 శాతం రాయితీతో విత్తనాలు అందిస్తారు. ప్రకృతి వ్యవసాయంపై ఫోకస్ పెట్టి.. అందుకు తగిన విధంగా పంటల సాగు విస్తీర్ణం పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. విత్తనాలు మాత్రమే కాదు.. వరి పండించే వారికి ఎకరానికి మూడు బస్తాలు యూరియా అందిస్తారు. అలాగే మినుము, ఉద్యాన పంటలు సాగుచేసే వారికి బస్తా యూరియా అందజేస్తారు. అయితే కాంప్లెక్స్ ఎరువులకు మాత్రం ఎలాంటి నిబంధనలు లేవు. రైతులు ఎరువుల వినియోగం తగ్గించే దిశగా వ్యవయసాయశాఖ అధికారులు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈసారి జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు. అందుకే రైతులు ఈసారి ఎక్కువగా వరి సాగుకు సిద్ధమయ్యారని చెబుతున్నారు. రైతలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని విత్తనాలన రాయితీపై పొందాలని సూచిస్తున్నారు.
పలు జిల్లాల్లో రైతులు ప్రధానంగా వరి సాగుకు సిద్ధమవుతున్నారు.. వారి కోసం అవసరమైన నాణ్యమైన విత్తనాలు రైతుసేవా కేంద్రాలు, ఏపీసీడ్స్, ప్రైవేటు వ్యాపారుల దగ్గర అందుబాటులో ఉంచారు. ముందుగానే విత్తన పరీక్షలు కూడా చేయించి.. రైతులకు నాణ్యమైన విత్తనం అందించేందుకు సిద్ధమైనట్లు అధికారులు తెలిపారు. అలాగే చిరు ధాన్యాలు సాగు దిశగా రైతుల్ని ప్రోత్సహిస్తున్నారు.. అందుకే ఆ విత్తనాలు కూడా రైతులకు రాయితీపై అందజేస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వం యూరియా సాగును తగ్గించాలని రైతులకు సూచిస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల అసెంబ్లీలో దీనిపై ప్రకటన చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa