భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ అర్షదీప్ సింగ్ను మొదటి రెండు టీ20ల్లో ఎందుకు విశ్రాంతి ఇచ్చారన్న ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో తొలి రెండు మ్యాచ్లకు దూరమైన అర్షదీప్ మూడో టీ20లో అద్భుతమైన రీ-ఎంట్రీ ఇచ్చి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. తన నాలుగు ఓవర్లలో 35 పరుగులకే మూడు వికెట్లు తీసిన అర్షదీప్ పవర్ ప్లేలో రెండు వికెట్లు పడగొట్టడం విశేషం.
ప్రెస్ కాన్ఫరెన్స్లో మోర్కెల్ మాట్లాడుతూ “అర్షదీప్ ఎక్స్పియరెన్స్ బౌలర్. తనకు జట్టులో తన ప్రాధాన్యం బాగా తెలుసు. కానీ మేము ప్రస్తుతం వివిధ బౌలింగ్ కాంబినేషన్లను పరీక్షించే దశలో ఉన్నాం. దీర్ఘకాల దృష్టితో జట్టును సిద్ధం చేస్తూనే ఉన్నాం. పవర్ప్లేలో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ అర్షదీప్. అయినా కూడా, ఈ టూర్లో ఇతర ఎంపికలను పరిశీలించడం మా లక్ష్యం” అని తెలిపాడు.
“ఎంపికల విషయంలో ప్రతి ఆటగాడు సంతోషంగా ఉండలేడు. కానీ మేం ప్రపంచకప్కు ముందు అన్ని అవకాశాలను పరీక్షించాలి. ఎవరు ఒత్తిడిలో ఎలా స్పందిస్తారు అనేది చూడటం చాలా ముఖ్యం. పరిమితమైన మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉండటంతో, ప్రతి నిర్ణయం జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆటగాళ్లు తమ అవకాశాల కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని మేం ప్రోత్సహిస్తున్నాం” అని అన్నాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో గాయపడిన నితీష్ కుమార్ రెడ్డి, మొదటి మూడు టీ20 మ్యాచ్లకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ కూడా అధికారికంగా ప్రకటించింది. ఆసీస్తో జరిగే ఆఖరి రెండు టీ20లకు నితీష్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. నాలుగో టీ20 కోసం నితీష్ కుమార్ రెడ్డి నెట్స్లో శ్రమిస్తున్నాడని మోర్నీ మోర్కెల్ చెప్పాడు.
ఇక ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్లో ఇరు జట్లు 1 - 1తో సమంగా నిలిచాయి. మొదటి టీ20 వర్షం కారణంగా రద్దవగా, రెండో టీ20లో ఆస్ట్రేలియా గెలవగా.. మూడో టీ20లో భారత్ విజయం సాధించింది. దాంతో నవంబర్ 6న క్వీన్స్లాండ్లో జరిగే నాలుగో టీ20 రసవత్తరంగా మారింది.
ఆస్ట్రేలియా స్క్వాడ్
టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), మిచెల్ ఓవెన్, మార్కస్ స్టోయినిస్, జోష్ ఇంగ్లిస్, జోష్ ఫిలిప్పే, సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కూహ్నెమాన్, గ్లెన్ మాక్స్వెల్, ఆడమ్ జాంపా, తన్వీర్ సంగా, మహ్లీ బీర్డ్మాన్.
టీమిండియా స్క్వాడ్
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, అభిషేక్ శర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జితేశ్ శర్మ, సంజు శాంసన్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ , హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa