టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ, జాతీయ జట్టులో అతనికి చోటు దక్కడం లేదు. రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున ఆడుతున్న షమీ, తొలి మూడు మ్యాచ్లలో 15 వికెట్లు పడగొట్టి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయినప్పటికీ, దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపిక చేసిన టెస్టు జట్టులో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అతడిని విస్మరించింది. షమీ మ్యాచ్ ఫిట్నెస్పై ఆందోళనల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో షమీ వ్యక్తిగత కోచ్ మహమ్మద్ బద్రుద్దీన్, సెలక్టర్ల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. "సెలక్టర్లు షమీని ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. దీనికి వేరే కారణం కనిపించడం లేదు. అతను అన్ఫిట్ కాదు. ఒక ఆటగాడు టెస్టు మ్యాచ్లు ఆడుతూ, రెండు గేమ్లలో 15 వికెట్లు తీశాడంటే అతను ఫిట్గా లేడని ఎలా అంటారు? అదంతా కేవలం ఒక సాకు మాత్రమే" అని బద్రుద్దీన్ ఆరోపించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa