జాతీయ గేయం 'వందేమాతరం' రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన 'ఎక్స్' వేదికగా ఒక ట్వీట్ చేశారు. "150 సంవత్సరాల స్ఫూర్తికి నా వందనం" అంటూ జాతీయ గేయానికి నీరాజనాలర్పించారు.బంకించంద్ర ఛటర్జీ రచించిన ఈ పవిత్ర గీతం మన స్వాతంత్ర్య సమరయోధుల్లో గొప్ప ఐక్యతా భావాన్ని రగిలించిందని జగన్ తన పోస్టులో పేర్కొన్నారు. ఆ స్ఫూర్తే మనందరికీ ఆదర్శమని తెలిపారు. అదే స్ఫూర్తితో మన భవిష్యత్ తరాల కోసం, వారి అభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.భారత స్వాతంత్ర్యోద్యమంలో 'వందేమాతరం' ఒక శక్తిమంతమైన రణనినాదంగా నిలిచింది. ప్రముఖ రచయిత బంకించంద్ర ఛటర్జీ 1875 నవంబర్ 7న ఈ గీతాన్ని రచించారు. అనంతరం 1882లో ఆయన రాసిన బెంగాలీ నవల ‘ఆనందమఠ్’లో దీనిని తొలిసారిగా ప్రచురించారు. స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత ఈ గీతాన్ని జాతీయ గేయంగా అధికారికంగా ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa