ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా ఉన్న అమెరికాలో ప్రస్తుత పరిస్థితి తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది. గత రెండు సంవత్సరాలుగా టెక్నాలజీ రంగంలో విపరీతంగా పెరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత షేర్ల విలువలు ఇప్పుడు తీవ్రమైన పతనం ఎదుర్కొంటున్నాయి. మార్కెట్ వర్గాలు దీన్ని “ఏఐ బుడగ పగలడం” అని వివరిస్తున్నారు. ఈ పరిణామాలు రికార్డు స్థాయి ఉద్యోగాల తొలగింపులతో కలసి, అమెరికా ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితిని పెంచి, ప్రపంచ మార్కెట్లపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.నవంబర్ 6న అమెరికన్ స్టాక్ మార్కెట్, ముఖ్యంగా నాస్డాక్, భారీ పతనాన్ని గమనించింది. ఈ పతనం AI కంపెనీల భవిష్యత్తుపై పెట్టుబడిదారుల్లో సందేహాలను మరింత పెంచింది. గత 24 నెలల్లో కొన్ని AI-సంబంధిత టెక్ కంపెనీల షేర్ల ధరలు వాస్తవ వృద్ధిని మించిపోయాయి. కొన్ని కంపెనీలు తాము అంచనాలను సాధించామని ప్రకటించినప్పటికీ, అధిక ధర వద్ద షేర్లు కొనుగోలు చేసిన పెట్టుబడిదారులు భవిష్యత్తులో తగిన రిటర్న్ లభిస్తుందా అనే నమ్మకంలో అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు.దాంతో టెక్, రిటైల్, లాజిస్టిక్స్ రంగాలలో భారీగా ఉద్యోగాలు తొలగించబడ్డాయి. అక్టోబర్ 2025లో సుమారు 1.53 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు, ఇది గత 20 సంవత్సరాల్లో అక్టోబర్ నెలలో అత్యధికం. 2025లో ఇప్పటివరకు మొత్తం 11 లక్షల ఉద్యోగాలు కోల్పోయినట్లు నమోదు అయ్యాయి. కంపెనీలు ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, AI మరియు ఆటోమేషన్ ప్రవేశం కారణంగా మానవ వనరుల అవసరం తగ్గిపోవడం వలన వేలాది ఉద్యోగాలు పోయాయి.మార్కెట్ల పతనానికి కేవలం AI షేర్ల భయం మాత్రమే కాదు; స్థూల ఆర్థిక అంశాలు కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు. అమెరికా అప్పు 38 ట్రిలియన్ డాలర్లను మించిపోయి జీడీపీకి 324 శాతానికి చేరింది. దీన్ని నియంత్రించడంలో విఫలమైతే భవిష్యత్తులో దేశం ఆర్థిక సంక్షోభంలో పడే ప్రమాదం ఉంది. ద్రవ్యోల్బణం పెరుగుదల, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెరుగుదల, కంపెనీల రుణభారం పెరగడం వృద్ధిని నిరోధిస్తున్నాయి. అలాగే, అమెరికా రాజకీయాల్లో పెరుగుతున్న అనిశ్చిత వాతావరణం కూడా పెట్టుబడిదారుల మనోభావాలను ప్రభావితం చేస్తోంది.ఈ పతనం కేవలం టెక్నాలజీ రంగానికి పరిమితం కాకుండా, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు, ఆర్థిక వ్యవస్థపై గాఢ ప్రభావాన్ని చూపుతోంది. ఇలాంటి పరిస్తితిలో ఇన్వెస్టర్లు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించడం ఇప్పుడు అత్యంత అవసరం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa