ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్ అణు కేంద్రంపై దాడిని అడ్డుకున్న ఇందిరాగాంధీ.... అమెరికా మాజీ అధికారి సంచలన వ్యాఖ్యలు

international |  Suryaa Desk  | Published : Sat, Nov 08, 2025, 08:09 PM

పాకిస్తాన్ అణ్వస్త్ర శక్తిగా ఎదగకుండా నిరోధించడానికి1980లలో భారత్, ఇజ్రాయెల్ దేశాలు కలిసి చేసిన ఒక రహస్య సైనిక ఆపరేషన్ ప్రణాళికగురించి అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ మాజీ అధికారి రిచర్డ్ బార్లో కీలక విషయాలు బయటపెట్టారు. ఆ ప్లాన్‌ను అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ తిరస్కరించడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 1980లలో పాకిస్తాన్ రహస్యంగా అణు కార్యకలాపాలను అభివృద్ధి చేస్తున్న సమయంలోరిచర్డ్ బార్లో అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో కౌంటర్‌ ప్రొలిఫరేషన్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారు.


ఈ సందర్భంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన రిచర్డ్ బార్లో.. పాకిస్తాన్‌లోని కీలకమైన కహూతా యురేనియం కేంద్రాన్ని బాంబులతో ధ్వంసం చేసేందుకు భారత్, ఇజ్రాయెల్ ఒక ముందస్తు దాడికి సిద్ధపడినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి తనకు సమాచారం వచ్చినట్లు ధృవీకరించారు.


 పాకిస్తాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకుండా నిరోధించడమేఈ సంయుక్త ఆపరేషన్ ప్రధాన లక్ష్యమని.. ముఖ్యంగా ఇజ్రాయెల్‌కు తీవ్ర శత్రువుగా భావించే ఇరాన్‌కు పాక్ అణ్వస్త్ర టెక్నాలజీని అందించకుండా నిరోధించే ఉద్దేశ్యం కూడా ఈ ప్రణాళికలో ఉన్నట్లు నివేదికలు సూచించాయి. ఆ సమయంలో తాను ప్రభుత్వ సర్వీసులో లేనప్పటికీ.. ఇంటెలిజెన్స్ వర్గాల్లో ఈ ఆపరేషన్ గురించి విన్నానని.. అయితే అది కార్యరూపం దాల్చలేదని పేర్కొన్నారు. ఈ ప్లాన్‌ను ఇందిరా గాంధీ అడ్డుకున్నారని ఇలా చేయ‌డం సిగ్గుచేటని రిచర్డ్ బార్లో తీవ్ర విమర్శలు గుప్పించారు.


ఆ ఆప‌రేష‌న్‌ను భారత ప్రధాని ఇందిరాగాంధీ అమోదించి ఉంటే ప్రపంచంలో ప్రస్తుతం చాలా సమస్యలు పరిష్కారమయ్యేవని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే అప్పటి అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ పరిపాలన అలాంటి దాడిని తీవ్రంగా వ్యతిరేకించి ఉండేదని రిచర్డ్ బార్లో తెలిపారు. ఎందుకంటే.. ఆ సమయంలో సోవియట్ యూనియన్‌పై ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా చేస్తున్న రహస్య యుద్ధానికి ఈ దాడి ఆటంకం కలిగించేదని పేర్కొన్నారు.


ఇక ఈ అంశాన్ని పాకిస్తాన్ తమకు అనుకూలంగా వాడుకుందని రిచర్డ్ బార్లో వెల్లడించారు. పాకిస్తాన్ అణు కార్యక్రమ రూపశిల్పి ఏక్యూ ఖాన్ నేతృత్వంలో అభివృద్ధి చెందిన కహూతా కేంద్రం.. చివరికి పాకిస్తాన్‌ను 1998లో అణు పరీక్షలు నిర్వహించే అణ్వస్త్ర దేశంగా మార్చిందని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa