భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ నవంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్గా ఉన్న దక్షిణాఫ్రికా.. ఈసారి ఎలాగైనా భారత గడ్డపై టెస్ట్ సిరీస్ కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు భారత్.. సొంతగడ్డపై ఎప్పట్లాగే ఫేవరెట్గా ఉంది. నవంబర్ 14న కోల్కతా వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. అయితే ఈ రెండు జట్ల మధ్య చివరిసారి భారత్లో 2019లో టెస్ట్ సిరీస్ జరిగింది. ఇందులో మూడు మ్యాచ్లు జరిగాయి. ఈ సిరీస్లో టీమిండియా.. ప్రొటీస్ టీమ్ను చిత్తు చిత్తుగా ఓడించింది.
రోహిత్ శర్మ కెరీర్లో 2019లో జరిగిన ఈ సిరీస్ హైలెట్. ఎందుకంటే ఈ సిరీస్ ద్వారా రోహిత్ శర్మ తొలిసారి తన కెరీర్లో టెస్ట్ మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగాడు. పరుగుల వరద పారించి.. ఆ తర్వాత జట్టుకు సారథిగా ఎదిగాడు. మొత్తంగా ఈ సిరీస్ మ్యాచ్లో భారత్ 3-0తో వైట్ వాష్ చేసింది.
తొలి టెస్ట్లో 203 రన్స్ తేడాతో విక్టరీ..
తొలి టెస్ట్ మ్యాచ్ విశాఖలో జరిగింది. టెస్ట్ క్రికెట్లో తొలిసారి రోహిత్ శర్మ.. ఓపెనింగ్ బ్యాటర్గా ఈ మ్యాచ్ ద్వారానే బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో మయాంక్ అగర్వాల్ (215), రోహిత్ శర్మ (176) చేయడంతో భారత్ 502/7 రన్స్ చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా 431 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లోనూ రోహిత్ సెంచరీ చేయగా.. ఈ మ్యాచ్లో భారత్.. 203 పరుగుల తేడాతో గెలుపొందింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా రోహిత్ నిలిచాడు.
రెండో టెస్ట్ హీరో కోహ్లీ..
రెండో టెస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ సత్తాచాటాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లకు 601 పరుగులు చేసింది. కోహ్లీ 254 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అనంతరం దక్షిణాఫ్రికా రెండు ఇన్నింగ్స్లలో 275 ఆలౌట్, 189 ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
చివరి టెస్ట్లో భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. రోహిత్ శర్మ డబుల్ సెంచరీ (212) సాధించగా, అజింక్య రహానే 115 పరుగులు చేయడంతో భారత్ 9 వికెట్లకు 487 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 162, రెండో ఇన్నింగ్స్లో 133 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా ఇన్నింగ్స్ 202 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన రోహిత్.. మొత్తంగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును సైతం అందుకున్నాడు. ఈ సిరీస్లో భారత్ 3-0తో విజయం సాధించింది. రోహిత్ శర్మ కెరీర్లో మరిచిపోలేని సిరీస్గా నిలిచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa