ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు ఢిల్లీలో పర్యటించనున్న లోకేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 12, 2025, 04:23 PM

మంత్రి నారా లోకేశ్ బుధవారం ఢిల్లీలో పర్యటించనున్నారు. విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు కేంద్ర మంత్రులను ఆహ్వానించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో కీలకమైన ఈ సదస్సును విజయవంతం చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా, కేంద్ర ప్రభుత్వ పెద్దల భాగస్వామ్యం కూడా ఉండాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి లోకేశ్ ఢిల్లీకి వెళ్లి పలువురు కేంద్ర మంత్రులను స్వయంగా కలిసి, విశాఖ సదస్సుకు హాజరు కావాలని కోరనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa