ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రస్థాయిలోనే కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు బుధవారం కూడా గాలి నాణ్యత సూచీ 400 పైన 'తీవ్ర' కేటగిరీలోనే నమోదైంది. నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్మేయడంతో చాలా ప్రాంతాల్లో దృశ్యమానత గణనీయంగా పడిపోయింది. దీంతో ప్రజలు స్వచ్ఛమైన గాలి కోసం అల్లాడిపోతున్నారు.కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేసిన డేటా ప్రకారం బుధవారం ఉదయం గీతా కాలనీ-లక్ష్మీ నగర్ రోడ్ ప్రాంతంలో గాలి నాణ్యత సూచీ 413గా నమోదైంది. ఇండియా గేట్, కర్తవ్య పథ్ పరిసరాలను సైతం విషపూరిత పొగమంచు కప్పేయగా, అక్కడ AQI 408గా ఉంది. నగరంలోని ఇతర ప్రాంతాలైన ఆనంద్ విహార్లో 438, అశోక్ విహార్లో 439, చాందినీ చౌక్లో 449, ద్వారకా సెక్టార్-8లో 422, ఐటీఓలో 433, జహంగీర్పురిలో 446, ఆర్కే పురంలో 432, రోహిణిలో 442గా గాలి నాణ్యత నమోదైంది. ఇంతటి కాలుష్యానికి ఎక్కువసేపు గురైతే తీవ్రమైన శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.గాలి నాణ్యత క్షీణిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP)-స్టేజ్ 3 చర్యలను అమలు చేయడంలో భాగంగా 5వ తరగతి వరకు విద్యార్థులకు బుధవారం నుంచి హైబ్రిడ్ విధానంలో తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa