రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటన జరిగి ఇప్పటికి 24 రోజులు అవుతుంది. ఈ ఘటనపై నిజాలు వెలికి తీయాలనే ఇంగితజ్ఞానం ఈ ప్రభుత్వానికి లేదా? అని వైసీపీ నేత మార్గని భరత్ ప్రశ్నించారు. అయన మాట్లాడుతూ... ఈ ఘటనను యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. కల్తీ పాల శాంపిల్స్ను నేషనల్ ఫొరెన్సిక్ ల్యాబ్లకు పంపకుండా స్థానిక ల్యాబ్లకే పంపుతున్నారు. అలా చేస్తే నిజాలు బయటకు రావు. ఈ ఘటనపై పూర్తి నిజాలు వెలుగులోకి రావాలంటే దర్యాప్తును సీబీఐకి అప్పగించాలి. రోజుకో బాధితుడి వెంటిలేటర్ తొలగించి మృతదేహాలను కుటుంబాలకు అప్పగిస్తూ ఈ ఘటనను యాక్సిడెంటల్గా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి నిజాలు వెలుగులోకి రావాలంటే స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa