ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT), 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ పీఎఫ్ డిపాజిట్లపై 8.25% వడ్డీని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఉన్న వడ్డీ రేటునే ఈసారి కూడా కొనసాగించాలని సీబీటీ నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు ఆర్థిక మంత్రిత్వ శాఖ తుది ఆమోదం తెలపగానే, వడ్డీ మొత్తం చందాదారుల ఖాతాల్లో జమ కానుంది. కాగా, వడ్డీని ప్రతి నెలా లెక్కించి, ఆర్థిక సంవత్సరం చివరలో ఏకమొత్తంగా ఖాతాలో జమ చేస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa