ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనారోగ్యంతో బొలిశెట్టి సత్యనారాయణ భార్య మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 15, 2025, 04:41 PM

జనసేన పార్టీ కీలక నేత బొలిశెట్టి సత్యనారాయణ భార్య నాగమణి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, ఈ తెల్లవారుజామున 3 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని బొలిశెట్టి సత్యనారాయణ స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.భార్య మరణంపై ఆయన ఎక్స్ వేదికగా ఒక భావోద్వేగ పోస్ట్ పెట్టారు. "నా జీవితంలో ఇది అత్యంత దుఃఖభరితమైన సమయం. 1983, మే 4న నా జీవితంలోకి అడుగుపెట్టిన నా ప్రియమైన భార్య నాగమణి, నా ప్రతి సంతోషంలో, సంక్షోభంలో నాతో నిలిచింది. ఈరోజు ఉదయం 3 గంటలకు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది" అని ఆయన పేర్కొన్నారు."నా ప్రతి సాధన వెనుక ఉన్న మౌనమైన బలం ఆమె. ఆమెతో పాటు నా హృదయంలోని ఒక భాగం కూడా వెళ్లిపోయింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.. ఓం శాంతి" అంటూ బొలిశెట్టి తన ఆవేదనను పంచుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa