ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీహార్ ఎన్నికల్లో కేవలం 30 ఓట్ల మెజారిటీతో గెలిచిన బీఎస్పీ ఏకైక సీట్

national |  Suryaa Desk  | Published : Sat, Nov 15, 2025, 04:42 PM

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పలు నియోజకవర్గాల్లో పోరు చివరి వరకు ఉత్కంఠగా సాగింది. చివరి రౌండ్ వరకు హోరాహోరీగా సాగి అతి తక్కువ మెజార్టీతో గెలుపొందిన అభ్యర్థులు ఉన్నారు. మూడు స్థానాల్లో అభ్యర్థులు 100 లోపు మెజార్టీతో విజయం సాధించడం విశేషం. రాష్ట్రంలో బీఎస్పీ గెలుచుకున్న ఏకైక సీటు కూడా కేవలం 30 ఓట్లతో గెలవడం గమనార్హం.243 స్థానాలున్న బీహార్‌లో బీఎస్పీ 192 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. రామ్‌గడ్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన సతీశ్ కుమార్ యాదవ్ తన సమీప బీజేపీ అభ్యర్థి అశోక్ కుమార్ సింగ్‌పై 30 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కౌంటింగ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. అర్ధరాత్రి తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. సతీశ్ కుమార్ యాదవ్‌కు 72,689 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థికి 72,659 ఓట్లు వచ్చాయి.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa