హిందూ క్యాలెండర్ ప్రకారం కొన్ని ప్రత్యేక రోజుల్లో శుభకార్యాలు చేయాలని పండితులు సూచిస్తారు. అదే సమయంలో, కొన్ని మౌడ్య రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని సూచన ఉంటాయి. ఈ సూచనలను పాటించకపోతే దోషాలు ఏర్పడుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.ఈ ఏడాది నవంబర్ 26 నుంచి శుక్ర మౌడ్యమి మొదలవుతుంది మరియు 2026 ఫిబ్రవరి 17 వరకు కొనసాగుతుంది. అంటే దాదాపు 83 రోజులపాటు శుక్ర మౌడ్యమి ఉంటుంది.మౌడ్యమి అంటే శూన్యం లేదా మూఢం అని అర్థం. అంటే ఈ రోజుల్లో శుభకార్యాలను చేయకూడదు. ఈ కాలంలో గురు మరియు శుక్ర గ్రహాలు సూర్యుడికి అత్యంత సమీపంలో ఉండటం వల్ల బలహీనమవుతాయి. సాధారణంగా వివాహాలు, గృహప్రవేశం, కొత్త వ్యాపార ప్రారంభం, బోర్లు తవ్వడం వంటి శుభకార్యాలకు గురు మరియు శుక్ర బలం అవసరం. అందువల్ల ఈ కాలంలో వీటిని నిర్వహించకూడదని సూచిస్తున్నారు.కానీ యథావిధిగా జరుపుకునే సీమంతం, నూతన వస్త్రాలంకరణ, నిత్య పూజలు, పండుగలు వంటి కార్యక్రమాలు ఈ మౌడ్యమి రోజుల్లో చేయవచ్చని, సమీప పండితుల సలహా తీసుకుని వాటిని నిర్వహించవచ్చని చెబుతున్నారు.ఈసారి 83 రోజులపాటు మూఢం రోజులు ఉండటం వల్ల, శుభకార్యాలు నిర్వహించాల్సిన వారు తమ కార్యక్రమాలను వాయిదా వేస్తున్నారు. అలాగే గృహప్రవేశాల కోసం కూడా ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్న వారు వేచి ఉండాలి.నిత్య పూజలు, దైవారాధన, పండుగలు యథావిధిగా జరుగుతాయి, కానీ కొత్త కార్యక్రమాలు లేదా కొత్త పనులు ప్రారంభించవద్దని పండితులు సూచిస్తున్నారు. అయితే, ఈ రోజుల్లో ప్రత్యేకంగా దైవారాధన చేస్తే కొన్ని ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయని కూడా చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa