2014-19 మధ్య సీఎంగా పనిచేసిన చంద్రబాబు అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని ప్రజలను నమ్మించాడే కానీ ఒక్క అడుగూ ముందుకు పడలేదు అని మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు అన్నారు. అయన మాట్లాడుతూ... వైయస్ జగన్ సీఎం కాగానే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహానికి భూమి పూజ చేయడమే కాకుండా నాలుగేళ్లలో దాన్ని పూర్తి చేసి సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలబెట్టారు. వైయస్ జగన్ నిర్మించారనే కారణంతో ఆయనకు మంచి పేరు రావొద్దనే కుట్రతో రాజ్యాంగ స్ఫూర్తికి చిహ్నంగా నిలిచిన ఈ ప్రాంతం పట్ల కూటమి ప్రభుత్వం వివక్ష చూపిస్తోంది. కాలనీల్లో ఉండే అంబేడ్కర్ని నగరం నడిబొడ్డున నిలబెట్టడం తెలుగుదేశం పార్టీ ఓర్చుకోలేకపోతుంది. దళితుల ఆత్మగౌరవ ప్రతీక అయిన అంబేడ్కర్ విగ్రహం పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు తొందర్లోనే బుద్ధి చెబుతాం. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్న తెలుగుదేశం పార్టీకి రాజ్యాంగ దినోత్సవం జరుపుకునే నైతిక హక్కు లేదు అని ఆగ్రహం వ్యక్తం చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa