రాజస్థాన్లోని కుచామన్ నగర్ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఒక వివాహ వేడుక సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. సాధారణంగా పెళ్లిళ్లలో బంగారు నాణేలు, వెండి వస్తువులు, డబ్బు కవర్లు రిటర్న్ గిఫ్ట్గా ఇస్తుంటారు కానీ, ఇక్కడి వరుడి తండ్రి మనోజ్ బర్వాల్ మాత్రం అందరికీ ఊహించని బహుమతిని అందించారు. తన కూతురు సోను బర్వాల్ను యశ్ బెద్వాల్కు ఇచ్చి పెళ్లి చేసిన ఈ తండ్రి, అతిథులందరికీ రిటర్న్ గిఫ్ట్గా హెల్మెట్లను ప్రసాదించడం ద్వారా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు.
వివాహానికి హాజరైన ప్రతి అతిథికి ఒక్కొక్క హై-క్వాలిటీ హెల్మెట్ను బహుకరించారు మనోజ్. మొత్తం 286 మంది అతిథులకు ఈ హెల్మెట్లు పంచడం జరిగింది. రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకుని, ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరి అనే సందేశాన్ని ఈ బహుమతి ద్వారా బలంగా చేర్చారు. దీనితో ఆయన ఒక్కసారిగా సోషల్ మీడియా సెలబ్రిటీగా మారిపోయారు.
ఈ అసాధారణ ఆలోచన వెనుక మనోజ్ బర్వాల్కు ఉన్న బాధ్యతాబద్ధమైన ఆలోచనే కారణం. గత కొన్నేళ్లుగా రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారులు ఎక్కువగా మరణిస్తున్న నేపథ్యంలో, హెల్మెట్ ధరించడం ఒక్కటే ప్రాణాలను కాపాడగలదని ఆయన గట్టిగా నమ్ముతారు. అందుకే తన కూతురి పెళ్లిని ఒక సామాజిక సందేశం చేరే అవకాశంగా మలుచుకుని, ఈ భిన్నమైన రిటర్న్ గిఫ్ట్ ఎంచుకున్నారు.
సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కాగానే నెటిజన్ల నుంచి కితాబుల మీద కితాబులు కురుస్తున్నాయి. “ఇదే నిజమైన బహుమతి”, “బంగారం కంటే విలువైన గిఫ్ట్”, “ఇలాంటి తండ్రులు దేశానికి కావాలి” అంటూ వేలాది మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. రాజస్థాన్లో మొదలైన ఈ హెల్మెట్ గిఫ్ట్ ట్రెండ్ దేశవ్యాప్తంగా వ్యాపించే అవకాశం కనిపిస్తోంది!
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa