పాణ్యం నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి శుక్రవారం కల్లూరు అర్బన్ పరిధిలోని మాధవినగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రజల అర్జీలను స్వీకరించి, అధికారులకు తక్షణ పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు రెడ్డి, యువత నేత ప్రభాకర్ యాదవ్, ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫ్రా డైరెక్టర్ నాగముని, పల్లె రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజల సమస్యలను సానుభూతితో విని, పరిష్కారం చూపడం ఎమ్మెల్యే లక్ష్యంగా పెట్టుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa