బెంగళూరులోని అత్యంత పురాతన దేవాలయాల్లో ఒకటైన చోళుల కాలం నాటి సోమేశ్వర స్వామి ఆలయంలో ఇకపై వివాహ వేడుకలు నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయానికి ప్రధాన కారణం—ఆలయంలో పూజలు చేసే పూజారులు, వారు సాక్షులుగా ఉన్న విడాకుల కేసుల కోసం తరచూ కోర్టులకు హాజరుకావాల్సి రావడం.గత ఆరు నుంచి ఏడు సంవత్సరాలుగా వేలాది జంటలు వివాహ బంధంలో అడుగుపెట్టిన ఈ ఆలయం ఎందుకు పెళ్లిళ్లను ఆపివేసిందో అనే విషయంలో భక్తుల్లో గందరగోళం నెలకొంది. ఇటీవల విడాకుల కేసులు పెరగడంతో, ఆ వివాహాలకు సాక్షాలుగా ఉన్న పూజారులు కోర్టు గదుల చుట్టూనే ఎక్కువ సమయం గడపాల్సి వచ్చిందని ఆలయ వర్గాలు వివరిస్తున్నాయి.ఆలయ పరిపాలన విభాగం ఇటీవల ఈ నిర్ణయాన్ని పౌరుల వద్ద అధికారికంగా వెల్లడించింది. పెరుగుతున్న చట్టపరమైన ఇబ్బందులను నివారించడం, పూజారులపై పడుతున్న భారం తగ్గించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 12వ శతాబ్దానికి చెందిన హలసూర్ సోమేశ్వర ఆలయం—శివుడికి అంకితం చేయబడిన ఈ దేవాలయం—బెంగళూరులో హిందూ వివాహాలకు చాలా ఏళ్లుగా పవిత్రమైన వేదికగా పేరు పొందింది. జనసాంద్రత అధికంగా ఉన్న హలసూర్ (ఉల్సూర్) ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం, గతంలో ప్రతి ఏడాదీ అనేక జంటల పెళ్లి కార్యములకు సాక్షి ఉండేది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa