2025కి గుడ్బై చెప్పి 2026కి ఘనంగా స్వాగతం పలికేందుకు దేశమంతా రెడీ అవుతోంది. మరోవైపు, ప్రతీ ఏడాది డిసెంబర్ 31న రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరుగుతుండటం తెలిసిందే. ఈ అవకాశాన్ని మరింత సమర్థంగా ఉపయోగించుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం మద్యం విక్రయాల సమయాలపై కీలక నిర్ణయం తీసుకుంది.న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డిసెంబర్ 31వ తేదీన ఉదయం 6 గంటల నుంచే మద్యం విక్రయాలకు ప్రత్యేక అనుమతి ఇచ్చింది. సాధారణంగా ఆలస్యంగా ప్రారంభమయ్యే లిక్కర్ సేల్స్ ఈసారి తెల్లవారుజామునే మొదలుకానున్నాయి. అయితే ఈ వెసులుబాటు ఒక్కరోజుకు మాత్రమే పరిమితం అని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే డిసెంబర్ 31 ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు మాత్రమే ఈ సడలింపు అమల్లో ఉంటుంది.ఈ నిర్ణయం బార్లు, పబ్లు, వైన్ షాపులు, ఇతర మద్యం విక్రయ కేంద్రాలన్నింటికీ వర్తిస్తుంది. దీంతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఎదురుచూస్తున్న మద్యం ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన నిబంధనల్ని కూడా అమలు చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa