శీతాకాలం కావటంతో అరకు అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. మంచు దుప్పటి కప్పుకున్న అరకు అందాలను చూసి మైమరిచిపోయేందుకు సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. దీంతో అరకులో సందర్శకుల తాకిడి పెరిగింది. ఈ క్రమంలోనే అరకు వెళ్లే పర్యాటకులకు ఊరట కలిగించేలా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం-కిరండూల్ మార్గంలో ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో కిరండూల్ ప్యాసింజర్కప అదనపు బోగీ ఏర్పాటు చేయాలని వాల్తేరు డివిజనల్ రైల్వే లలిత్ బోహ్రా అధికారులను ఆదేశించారు.
అదనపు కోచ్లను అటాచ్ చేయడంతో పాటుగా.. అధిక డిమాండ్ ఉన్న రోజుల్లో ప్రత్యేక రైలును నడపాలని ఆదేశించారు. రైల్వే స్టేషన్ను పరిశీలించిన వాల్తేరు డీఆర్ఎం.. ప్లాట్ఫారమ్లపై భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే బుకింగ్ ప్రాంతాలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి వద్ద భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. రైల్వే స్టేషన్లోని వివిధ సౌకర్యాలను కూడా తనిఖీ చేశారు.
మరోవైపు వారాంతపు రోజులు, నూతన సంవత్సరం సమీపిస్తూ ఉండటంతో అరకుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దీంతో శని, ఆదివారాల్లో అరకు ఘాట్ రోడ్లలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అలాగే విశాఖపట్నం రైల్వే స్టేషన్లో అరకు వైళ్లే రైలులో సీట్ల కోసం పర్యాటకులు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు, అరకు వెళ్లే ఏకైక రైలు పర్యాటకులతో కిక్కిరిసిపోయింది. దీంతో సీట్లు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు సోమవారం నుంచి (డిసెంబర్ 29) జనవరి 20 వరకు రైలు నంబర్ 58501 విశాఖపట్నం-కిరండూల్ ప్యాసింజర్లో 1 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ను జత చేశారు.
ఇక ఈ రైలుతిరుగు ప్రయాణంలో.. కిరండూల్-విశాఖపట్నం ప్యాసింజర్ (58502) నంబరుతో బయల్దేరుతుంది. ఈ రైలుకు కూడా మంగళవారం నుంచి జనవరి 21 వరకు ఒక జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ను పెంచారు. అలాగే, సోమవారం రోజున ప్రయాణికుల అదనపు రద్దీని తగ్గించడానికి ఒక ప్రత్యేక రైలు నడిపించారు. శీతాకాలంలో అరకులోని కాఫీ తోటలు సరికొత్త అందాలను సంతరించుకుంటాయి. కాఫీ తోటలతో పాటుగా బొర్రా గుహలు, ఉడెన్ బ్రిడ్జి వంటి ప్రకృతి అందాలను చూసేందుకు భారీగా పర్యాటకులు వస్తుంటారు.
అయితే ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు తమ వాహనాలను ఘాట్ రోడ్లలో నిలిపివేయటంతో శని, ఆదివారాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం నుంచి 11 వరకు, మధ్యాహ్నం మూడు తర్వాత మాత్రమే కాఫీతోటల సందర్శనకు అవకాశం కల్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa