ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూటమి పాలనలో ఒక్క కొత్త పధకమైన అమలుచేశారా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 31, 2025, 12:28 PM

రాష్ట్రంలో ఏ వాహనం కొనుగోలు చేసినా చంద్రబాబు ప్రభుత్వానికి ట్యాక్స్‌ కట్టాల్సిన పరిస్థితి నెలకొందని వైయస్‌ఆర్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్‌ సాకె శైలజనాథ్‌ తీవ్రంగా విమర్శించారు. వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జీఎస్టీ స్థానంలో బీఎస్టీ(బాబు స‌ర్వీస్ ట్యాక్స్‌) గా మార్చి ప్రజలను దోచుకునే విధానాన్ని కూటమి ప్రభుత్వం అవలంబిస్తోందన్నారు.ఈ నెల 29వ తేదీ జ‌రిగిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, కానీ ఆ ఆశలన్నీ అడియాసలుగానే మిగిలిపోయాయన్నారు. కొత్త ఏడాదిలో అయినా ప్రజలకు ఊరట కలిగించే కొత్త పథకాలు వస్తాయేమో అని ఎదురుచూసిన అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం మరోసారి నిరాశపరిచిందని విమర్శించారు.  వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాల పేర్లను మార్చడం తప్ప, కూటమి ప్రభుత్వం కొత్తగా ఒక్క పథకాన్నీ తీసుకురాలేదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ బకాయిలు, రైతు సబ్సిడీలు వంటి కీలక అంశాలపై కేబినెట్‌లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ధరల నియంత్రణ, నిరుద్యోగ భృతి, పింఛన్ల పెంపు వంటి హామీలన్నీ గాలిలో కలిసిపోయాయని పేర్కొన్నారు. ప్రజలపై పన్నుల భారం మోపడం తప్ప, సంక్షేమంపై దృష్టి పెట్టని ఈ ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో సరైన సమాధానం ఇస్తారని డాక్టర్‌ సాకె శైలజనాథ్‌ హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa