రాష్ట్రంలో పోలీస్ వ్యవస్ధ పూర్తిగా గాడి తప్పిందని, డీజీపీ బాధ్యతారాహిత్య సమాధానమే దీనికి నిదర్శనమని వైయస్ఆర్సీపీ లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... జంతు బలుల కేసులో అరెస్టైన వారిని పెట్రోలింగ్ వాహనాలు లేకవపోవడం వలనే రోడ్డుపై నడిపించామని డీజీపీ చెప్పిన వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు. గాడితప్పిన పోలీస్ వ్యవస్ధకు ఇదే నిదర్శనమని మండిపడ్డారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే యథేచ్ఛగా చట్టాలను ఉల్లంఘిస్తుంటే సామాన్యులకు న్యాయం జరుగుతుందన్న భరోసా ఎవరిస్తారని ప్రశ్నించారు. పోలీసులు సివిల్ పంచాయతీల్లో తలదూర్చుతూ బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలు నిత్యం పత్రికల్లో పతాక శీర్షికల్లో వస్తున్నా... అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఈ రకమైన చర్యల వల్లే... గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్న పోలీస్ వ్యవస్థ, కూటమి పాలనలో దేశంలోనే అట్టడుగు స్థానానికి పడిపోయిందని విమర్శించారు. రాజ్యాంగాన్ని అనుసరించి నడుచుకోవాల్సిన పోలీసులే న్యాయస్థానాల ఆదేశాలను సైతం ఉల్లంఘిస్తూ పొలిటికల్ బాస్ల ఆదేశాలతో రాజకీయ కుట్రల్లో భాగస్వాములు కావడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ఇటీవల కదిరిలో జరిగిన ఘటన దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అని తేల్చి చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa