ఇరాన్ ఆర్థిక సంక్షోభం వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్తో వాణిజ్యం జరిపే అన్ని దేశాలపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందన్నారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ట్రూత్లో ట్రంప్ పోస్టు చేశారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఇరాన్లో జీవన వ్యాయాలు పెరిగిపోయి పౌరులు వీధుల్లో తీవ్ర నిరసనలు కొనసాగిస్తున్న వేళ ఈ ప్రకటన చేయడం చర్చనీయాంశమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa