ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజశేఖరరెడ్డి చిత్రపటానికి నూతన వస్త్రాలు బహూకరించిన వైసీపీ నాయకులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 17, 2026, 02:22 PM

శత్రువుకైనా చేయూతనిచ్చే విశాల హృదయం కలిగిన మహానేత దివంగత మాజీ ముఖ్యమంత్రి డా. వైయస్ రాజశేఖరరెడ్డి అని విజయనగరం జిల్లా సోషల్ మీడియా విభాగం అధ్యక్షులు వై. వాసు నాయుడు అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రాజాం అసెంబ్లీ పరిధిలోని వంగర మండలం, ఋషింగి గ్రామంలో తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి డా. వైయస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి నూతన వస్త్రాలు బహూకరించి ఘనంగా నివాళులు అర్పించారు. “పెద్దాయన… నిన్ను మరువం. నీ చిరునవ్వు మా గుండెల్లో పదిలంగా ఉంది. నువ్వు చూపిన బాటలోనే మా పయనం. మీ ఆశయ సాధనకే మా జీవితం” అంటూ భావోద్వేగంతో రాజన్నను స్మరించుకున్నారు వాసు నాయుడు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాదీ కూడా తమ కుటుంబ పెద్దలతో కలిసి దివంగత మహానేతకు నూతన వస్త్రాలు చూపించి సంక్రాంతి పండుగ జరుపుకున్నామని తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మా ఆరాధ్య నాయకుడు, రైతు బాంధవుడు డా. వైయస్ రాజశేఖరరెడ్డి గారిని కుటుంబ సభ్యుడిగా భావించి ప్రతి పండుగకు ఆయనను స్మరించుకోవడం మా సంప్రదాయం. జోహార్ వైయస్‌ఆర్… జోహార్ పెద్దాయన… వైయస్‌ఆర్ ఫరెవర్” అంటూ తన అభిమానాన్ని వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa