ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుగుపయనం కష్టాలు.. విజయవాడ బస్సులో తొక్కిసలాట

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 19, 2026, 03:05 PM

పండుగ సెలవులు ముగియడంతో విద్యాసంస్థలు, కార్యాలయాలు తిరిగి తెరుచుకున్నాయి. దీంతో సొంతూళ్లకు వెళ్లినవారంతా తిరిగి పట్టణాలకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బస్సులు, రైళ్లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. టోల్ గేట్ల వద్ద కూడా కిలోమీటర్ల మేర వాహనాల క్యూలు దర్శనమిస్తున్నాయి. రైళ్ల జనరల్, స్లీపర్ బోగీలు కిక్కిరిసిపోయాయి. సీట్లు దొరక్క, స్పెషల్ బస్సులు లేక, సాధారణ బస్సుల్లోనూ ఇరుక్కుని ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో పల్నాడు జిల్లా వినుకొండలో బస్సు ఎక్కే ప్రయత్నంలో తొక్కిసలాట జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa