ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇకపై శాంతి గురించి ఆలోచించను

international |  Suryaa Desk  | Published : Tue, Jan 20, 2026, 01:12 PM

తనకు నోబెల్ శాంతి బహుమతి రాకపోవడానికి నార్వే ప్రభుత్వమే కారణమని భావిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. నార్వే ప్రధాని జోనస్ గార్ స్టోర్‌కు ఘాటైన సందేశం పంపారు. "నేను ఎనిమిదికి పైగా యుద్ధాలను ఆపాను.. అయినా మీ దేశం నాకు నోబెల్ ఇవ్వకూడదని నిర్ణయించుకుంది. కాబట్టి ఇకపై శాంతి గురించి ఆలోచించాల్సిన బాధ్యత నాపై లేదు. నా దృష్టి అంతా అమెరికా ప్రయోజనాలపైనే ఉంటుంది" అని ట్రంప్ ఆ మెసేజ్‌లో పేర్కొన్నారు.ఈ వ్యాఖ్యలపై నార్వే ప్రధాని జోనస్ గార్ స్టోర్ హుందాగా స్పందించారు. నోబెల్ బహుమతుల ఎంపిక పూర్తిగా స్వతంత్ర కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుందని, ఇందులో ప్రభుత్వం జోక్యం ఉండదని ఆయన పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని తాను గతంలోనే ట్రంప్‌కు వివరించానని ఆయన తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa