బ్యాడ్మింటన్ నుంచి తన రిటైర్మెంట్పై స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత రెండేళ్లుగా ఆటకు దూరంగా ఉంటున్న సైనా, తాజాగా ఓ పాడ్కాస్ట్లో పాల్గొని తన పరిస్థితిని వెల్లడించారు. మోకాలి సమస్యతో తాను తీవ్రంగా బాధపడుతున్నట్లు ఆమె తెలిపారు. శారీరకంగా ఆటకు సహకరించనప్పుడు దూరంగా ఉండటమే మంచిదని అభిప్రాయపడ్డారు.2012 లండన్ ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన సైనా, చివరిసారిగా 2023లో జరిగిన సింగపూర్ ఓపెన్లో పోటీల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత నుంచి ఆమె కోర్టుకు దూరంగానే ఉన్నారు. ఈ సందర్భంగా సైనా మాట్లాడుతూ.. రెండేళ్ల కిందటే తాను ఆడటం ఆపేశానని పేర్కొన్నారు. తనకు ఇష్టం ఉండటంతోనే ఈ క్రీడలోకి వచ్చానని, అయితే ఇప్పుడు ఆడటం లేదు కాబట్టి ప్రత్యేకంగా రిటైర్మెంట్ అని ప్రకటించాల్సిన అవసరం లేదని భావిస్తున్నానన్నారు. ఆట ఆడేంత శారీరక సామర్థ్యం లేనప్పుడు ఆగిపోవడమే మంచిదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa