టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి తన సోషల్ మీడియా పోస్ట్తో సంచలనం సృష్టించారు. యూరప్కు చెందిన అతిపెద్ద బడ్జెట్ ఎయిర్లైన్ 'ర్యాన్ఎయిర్'ను కొనుగోలు చేయమంటారా అంటూ తన ఎక్స్ ఖాతాలో ఒక పోల్ ప్రారంభించారు. ర్యాన్ఎయిర్ సీఈఓ మైఖేల్ ఓ'లియరీతో జరిగిన తీవ్ర వాగ్వాదం తర్వాత ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.ర్యాన్ఎయిర్ విమానాల్లో స్టార్లింక్ సేవలను ఇన్ఫ్లైట్ వైఫైగా ఉపయోగించడంపై మొదలైన వ్యాపార విభేదం వ్యక్తిగత దూషణల వరకు వెళ్లింది. తమ వ్యాపారానికి స్టార్లింక్ ఖర్చులు సరిపడవని ర్యాన్ఎయిర్ ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ర్యాన్ఎయిర్ సీఈఓ ఓలియరీ మస్క్ను ఒక ఇడియట్అని అతడిని ఎవరూ పట్టించుకోవద్దని వ్యాఖ్యానించారు. దీనిపై మస్క్ ఘాటుగా స్పందిస్తూ ఓ'లియరీ అట్టర్ ఇడియట్అని అతడిని ఉద్యోగంలో నుంచి తీసేయండి అని పోస్ట్ చేశారు.ఈ మాటల యుద్ధం నేపథ్యంలోనే మస్క్ ర్యాన్ఎయిర్ను కొనుగోలు చేయాలా వద్దా అని పోల్ నిర్వహించారు. కొద్ది గంటల్లోనే ఈ పోల్కు 7,50,000కు పైగా ఓట్లు రాగా, 76.8 శాతం మంది కొనుగోలుకు మద్దతు తెలిపారు. తనదైన శైలిలో స్పందించిన మస్క్ర్యాన్ఎయిర్ను 'ర్యాన్' అనే వ్యక్తి నడపాలి, అతడిని అసలైన పాలకుడిగా చేయడం మీ విధి అంటూ చమత్కరించారు. అయితే, ఇది కేవలం సరదా పోలా లేక నిజంగానే టేకోవర్ చేసే ఉద్దేశం ఉందా అనే దానిపై మస్క్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa