ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్‌ను విమర్శించడమే చంద్రబాబు, లోకేష్‌ రాజకీయ ఎజెండాగా మారింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 21, 2026, 11:09 AM

టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయక, చెప్పుకోవడానికీ ఏమీ లేక ‘ఆత్మస్తుతి. పరనింద’ అన్నట్లుగా వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ఆక్షేపించారు. సమయం, సందర్భం, వేదిక ఏదైనా సరే శ్రీ వైయస్‌ జగన్‌ను విమర్శించడమే చంద్రబాబు, లోకేష్‌ రాజకీయ ఎజెండాగా మారిందని ఆయన ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు విచ్చలవిడిగా పెరిగాయని.. ల్యాండ్, శాండ్, వైన్, మైన్, డ్రగ్స్‌ ఇలా అన్నీ మాఫియాలా మారాయని గుర్తు చేశారు. వాటన్నింటినీ కప్పి పుచ్చుకోవడం కోసమే, అదే పనిగా జగన్‌గారిపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. పల్నాడు జిల్లా పిన్నెల్లిలో దళితుడైన సాల్మన్‌ హత్యకు పోలీసుల వైఫల్యమే కారణమని ఆరోపించారు. సాల్మన్‌ హత్యపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa