బాధ్యతగల పదవుల్లో ఉంటూ ప్రపంచ వేదికలపై రాష్ట్రంలో పెట్టుబడులు గురించి మాట్లాడకుండా వ్యక్తిగత విమర్శలు చేయడంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం వైయస్ఆర్సీపీకార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... దావోస్ లో పెట్టుబడులు గురించి కాకుండా చంద్రబాబు పొలిటికల్ మార్కెటింగ్ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. అధికార పార్టీ తీరు బ్రాండ్ ఇమేజ్ తో కాకుండా దావోస్ కి బ్యాండ్ మేళంతో పర్యటనకు వెళ్లినట్లుందని మండిపడ్డారు. వైయస్.జగన్ హయాంలో ఒప్పందం చేసుకున్న పరిశ్రమలకు శంకుస్థాపన చేస్తూ.. వాటిని తమ ఖాతాలోకి వేసుకోవడం ద్వారా... ముమ్మూటికీ తండ్రీ, కొడుకులు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని అమర్ తేల్చి చెప్పారు. అన్నీ తానే అనడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అని, తాను కట్టకపోయినా శంషాబాద్ విమానాశ్రయం, అవుటర్ రింగ్ రోడ్డు, భోగాపురం విమానాశ్రయాలను చంద్రబాబు తన ఖాతాలోకి వేసుకోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. 18 నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన పరిశ్రమలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవైపు రాష్ట్రంలో సంక్రాంతి పండగలో అధికార పార్టీ నేతలో అశ్లీల నృత్యాలు నిర్వాహకులగా మారితే... దానిపై స్పందించకపోవడం దారుణమన్నారు. చలి కారణంగా దావోస్ పర్యటనకు వెళ్లలేదంటూ తనపై మంత్రి లోకేష్ చేసిన ఆరోపణలు మీద అమర్నాధ్ తీవ్రంగా స్పందించారు. లోకేష్ చేసిన వ్యాఖ్యలను నిరూపించాలని లేని పక్షంలో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa