ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉక్కు కర్మాగారం పురోగతిపై లక్ష్మీ మిట్టల్ తో సమావేశమైన చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 22, 2026, 11:49 AM

దావోస్ లోని ఏపీ లాంజ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో అర్సెల్లార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్, సీఈవో ఆదిత్య మిట్టల్ సమావేశమయ్యారు. ఈ కీలక భేటీలో మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ కూడా పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లాలో అర్సెల్లార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ సంస్థ నిర్మించ తలపెట్టిన భారీ ఉక్కు కర్మాగారం పురోగతిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. తొలి దశలోనే దాదాపు రూ. 60 వేల కోట్ల భారీ పెట్టుబడితో ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నారు. పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి వివిధ దశల్లో ఉన్న అనుమతులు, భూసేకరణ వంటి అంశాలపై లక్ష్మీ మిట్టల్ సమక్షంలోనే సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 15వ తేదీలోగా అన్ని అనుమతులు పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అనంతరం స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ పరంగా ఎలాంటి జాప్యం ఉండదని, అవసరమైతే ఢిల్లీ వెళ్లి కేంద్రం నుంచి అనుమతులు సాధించాలని మంత్రులకు సీఎం సూచించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa