ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటు కోసం యూఏఈ మంత్రితో సమావేశమైన చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 22, 2026, 12:09 PM

ఏపీని ఉద్యాన, ఆక్వా, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. దావోస్ పర్యటనలో ఉన్న ఆయన, యూఏఈ విదేశీ వాణిజ్య శాఖ మంత్రి థాని బిన్ అహ్మద్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏపీ నుంచి యూఏఈకి ఉత్పత్తుల ఎగుమతితో పాటు రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని ప్రతిపాదించారు.ఈ సమావేశంలో ఏపీలో 'దుబాయ్ ఫుడ్ క్లస్టర్' ఏర్పాటు ప్రతిపాదనపై ఇరువురు నేతలు ప్రధానంగా చర్చించారు. యూఏఈ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో అనువైన మౌలిక సదుపాయాలు ఉన్నాయని చంద్రబాబు వివరించారు. ఉత్పత్తుల వేగవంతమైన రవాణాకు వీలుగా పోర్టులు, విమానాశ్రయాలు, రోడ్డు, రైలు మార్గాల నెట్‌వర్క్ విస్తృతంగా ఉందని తెలిపారు. జాతీయ పారిశ్రామిక కారిడార్లు కూడా రాష్ట్రంతో అనుసంధానమై ఉన్నాయని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa