ఢిల్లీ నుంచి హైదరాబాదు మీదుగా తిరుపతికి వచ్చే ఎయిర్ ఇండియా విమాన సర్వీసు సమయాన్ని మార్చారు. ఇప్పటి వరకు మధ్యాహ్నం 2.10గంటలకు రేణిగుంటకు వచ్చే ఈ విమానం 3.10గంటలకు ఢిల్లీకి బయలుదేరి వెళ్లేది. బుధవారం నుంచి మధ్యాహ్నం 1.45గంటలకు రేణిగుంటకు చేరుకుని, 2.10గంటలకు ఢిల్లీకి బయలుదేరి వెళుతుంది.కాగా హైదరాబాదు నుంచి రేణిగుంటకు 7.15గంటలకు వచ్చి 7.40గంటలకు వెళ్లాల్సిన ఎయిర్ అలయన్స్ విమానం ఆలస్యంగా 9.10గంటలకు వచ్చి 9.40గంటలకు వెళ్లింది. అలాగే ముంబై నుంచి 5.20గంటలకు వచ్చి 6.10గంటలకు వెళ్లాల్సిన ఇండిగో విమానం 40 నిమిషాలు ఆలస్యంగా నడిచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa