ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు లోకేష్ పాలనను రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చేశారని విమర్శ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 31, 2026, 08:08 PM

 చంద్రబాబు ఆయన కుటుంబంపై వైసీపీ అధినేత జగన్ సంచలన ఆరోపణలు చేశారు. విశాఖపట్నంలో సుమారు రూ.5,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అధికార దుర్వినియోగంతో కబ్జా చేశారని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు హలో ఇండిఇది ఒక వేక్-అప్ కాల్" అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చంద్రబాబు కుటుంబం సాగిస్తున్న భూ దోపిడీని దేశం గమనించాలని కోరారు.రుషికొండ సమీపంలో ఉన్న 54.79 ఎకరాల అత్యంత విలువైన భూమిని చంద్రబాబు తన కుటుంబ సభ్యుడైన విశాఖ ఎంపీ శ్రీభరత్‌కు అక్రమంగా కట్టబెట్టారని జగన్ ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో స్వాధీనం చేసుకుని, ఫెన్సింగ్ వేసిన ఈ భూములను ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉచితంగా బహుమానంగా ఇచ్చిందని ధ్వజమెత్తారు. నారా లోకేశ్ కు ఎలాంటి అధికార పరిధి లేకపోయినా, విద్యాశాఖ ద్వారా ఒక మెమో జారీ చేయించి తన తోడల్లుడికి భూములు కేటాయించేలా చక్రం తిప్పారని జగన్ మండిపడ్డారు. ఇది చంద్రబాబు కుటుంబ కుట్రలో భాగమేనని విమర్శించారు.ఈ భూ కేటాయింపు తీర్మానాన్ని ఆమోదింపజేయడానికి చంద్రబాబు తీవ్ర ఒత్తిళ్లు, బెదిరింపులకు పాల్పడ్డారని జగన్ పేర్కొన్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్  సభ్యులను భయపెట్టి ఏకపక్షంగా ఆమోదించుకున్నారని అన్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు ప్రయత్నించిన వై‌సీపీ కార్పొరేటర్లపై భౌతిక దాడులు చేసి, బలవంతంగా బయటకు పంపించారని, ఈ దాడుల్లో పలువురు గాయపడినా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారని తెలిపారు. ఈ భూ దోపిడీని అమలు చేయడం కోసమే బీసీ యాదవ వర్గానికి చెందిన వైసీపీ మహిళా మేయర్‌ను తొలగించారని, కార్పొరేటర్లను కోట్లతో కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని బుల్డోజ్ చేశారని ఆరోపించారు.చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతిసారీ ప్రభుత్వ ఆస్తులు మాయమవుతాయని, వారి కుటుంబ ఆస్తులు మాత్రం పెరుగుతాయని, ఇది ఒక పరిపాటిగా మారిపోయిందని జగన్ విమర్శించారు. చంద్రబాబు, లోకేశ్ తమ పాలనను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చేశారనడంలో ఎలాంటి సందేహం లేదని ఆయన స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa